భూమి కోసం దళితుడి నిరసన

5 Apr, 2017 23:02 IST|Sakshi
భూమి కోసం దళితుడి నిరసన

అమడగూరు (పుట్టపర్తి) : తమ గ్రామానికే చెందిన ఓ వ్యక్తి తన భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నాడని అమడగూరు మండలం గుండువారిపల్లికి చెందిన నరసింహులు అనే దళితుడు బుధవారం స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట నిరసనకు దిగాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా 414 సర్వే నెంబరులోని నాలుగు ఎకరాల భూమి తన ఆధీనంలో ఉందన్నారు. పాస్‌పుస్తకం కూడా తన పేరుమీదే ఉందన్నారు. అయితే తమ గ్రామానికే చెందిన ఓ వ్యక్తి తనకు తెలియకుండా అతని పాస్‌పుస్తకంలో ఈ భూమిని ఎక్కించుకున్నారని ఆవేదన చెందారు. పై అధికారులకు తెలిపినా పట్టించుకున్న పాపాన పోలేదని విచారం వెలిబుచ్చారు.

మరిన్ని వార్తలు