నేటి నుంచి ఓయూసెట్ పరీక్షలు

6 Jun, 2016 00:12 IST|Sakshi

హైదరాబాద్: ఓయూతో పాటు తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాల్లో వివిధ పీజీ, పీజీ డిప్లొమా, ఐదేళ్ళ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి సోమవారం నుంచి ఓయూసెట్-2016 ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం ఎమ్మెస్సీ జాగ్రఫీ, మధ్యాహ్నం ఎంఏ థియేటర్ ఆర్ట్స్, ఎమ్మెస్సీ జాగ్రఫీ, ఎలక్ట్రానిక్స్, సాయంత్రం ఎంఏ లింగ్విస్టిక్స్ కోర్సులకు ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నారు. బయోమెట్రిక్ విధానం కావడంతో పరీక్షకు అరగంట ముందుగా చేరుకోవాలని పీజీ అడ్మిషన్స్ జాయింట్ డెరైక్టర్ ప్రొఫెసర్ కిషన్ తెలిపారు.

మరిన్ని వార్తలు