ఏపీలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు

12 Jan, 2016 15:44 IST|Sakshi

విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్లో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని కేంద్ర ఎరువుల, రసాయనాల శాఖ మంత్రి  అనంతకుమార్ వెల్లడించారు. అలాగే విశాఖపట్నంలోని హెచ్పీసీఎల్ని విస్తరిస్తామని చెప్పారు. మంగళవారం విశాఖపట్నంలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో అనంతకుమార్ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా అనంతకుమారు మాట్లాడుతూ... దేశంలో యూరియా కొరత లేకుండా చేస్తామన్నారు.

ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతంలో పూర్వం శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించారని... ఈ నేపథ్యంలో ఇరుప్రాంతాల అనుబంధాన్ని అనంతకుమార్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో మెడికల్ డివైస్ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే విశాఖలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మా ఎడ్యూకేషన్ రీసర్చ్ ఏర్పాటు చేస్తామని అనంతకుమార్ చెప్పారు.

మరిన్ని వార్తలు