తిరుమలకు సైకిల్‌యాత్ర

12 Sep, 2016 00:41 IST|Sakshi
తిరుమలకు సైకిల్‌యాత్ర
బాలాయపల్లి : తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని నరేంద్రపురం గ్రామానికి చెందిన వేంకటేశ్వరస్వామి భక్తులు తిరుమలకు సైకిల్‌యాత్ర చేపట్టారు. ఆదివారం మండలంలోని వెంకటరెడ్డి గ్రామం వద్ద కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సకాలంలో వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని 20 ఏళ్ల నుంచి 215 మంది తిరుమలకు సైకిల్‌ యాత్ర చేస్తున్నామని తెలిపారు. ఈసారి రాష్ట్రానికి ప్రత్యేకహోదా రావాలని ఈనెల 9వ తేదీన తేది సైకిల్‌ యాత్ర ప్రారంభించామని చెప్పారు. 
మరిన్ని వార్తలు