నకిలీ వైద్యులకు రిమాండ్‌

21 Jun, 2017 21:00 IST|Sakshi
నకిలీ వైద్యులకు రిమాండ్‌
ఆదోని: నకిలీ వైద్యులు నాగేంద్ర, ఆయన సమీప బంధువు జ్యోతిలను బుధవారం రిమాండ్‌కు తరలించారు.  పట్టణంలోని మేదరిగేరిలో విజయ గౌరి సూపర్‌ స్పెషాలిటీ, కర్నూలులోని జేపీ సూపర్‌ స్పెషాలిటీపై దాడులు చేసి నకిలీ వైద్యులు నాగేంద్ర, ఆయన సమీప బంధువు జ్యోతిని విజిలెన్స్‌ అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. బుధవారం తెల్లవారుజాము వరకు విచారణ కొనసాగింది. అనంతరం నిందితులను ఆదోని వన్‌ టౌన్‌ పోలీసులకు అప్పగించారు. ఇన్‌చార్జ్‌ డిప్యూటీ డీఎం అండ్‌ హెచ్‌ఓ డాక్టర్‌ శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్‌ టౌన్‌ ఎస్‌ఐ ఎస్‌కె బాబు నిందులపై ఐపీసీ 468, 471, 420, మెడికల్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు నిందితులను రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ బాబు తెలిపారు.
 
మరిన్ని వార్తలు