ఒంగోలు : ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం అద్దంకి బ్రాంచి కెనాల్కు శుక్రవారం గండ్లు పడ్డాయి. వల్లేపల్లి లాకుల సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున గండ్లు పడ్డాయి. దీంతో భారీగా నీరు పంట పొలాల్లోకి ప్రవేశించింది. దాంతో షట్టర్లను అధికారులు కిందికి దింపారు. నీరు ముందుకు వెళ్లకుండా కంప చెట్లను అడ్డుగా ఉంచటంతోనే కెనాల్కు గండ్లు పడ్డాయని రైతులు ఆరోపిస్తున్నారు.