జిల్లాలో సెక్షన్‌ 30 అమల్లో ఉంది

11 Nov, 2016 23:07 IST|Sakshi
కాకినాడ క్రైం: 
జిల్లాలో సెక్షన్‌ 30 ఆఫ్‌ ఇండియన్‌ పోలీస్‌ యాక్టు అమల్లో ఉందని, పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా సమావేశాలు, ధర్నాలు, ఆందోళనలు చేపట్టరాదని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్‌ శుక్రవారం పత్రికలకు విడుదల చేసిన ఓ ప్రకటనలో  పేర్కొన్నారు. శాంతి, అంతర్గత భద్రతల పరిరక్షణలో భాగంగా నవంబర్‌ ఒకటి నుంచి 30వ తేదీ దాకా సెక్షన్‌ 30 అమల్లో ఉందన్నారు. దీని ప్రకారం కాకినాడ, రామచంద్రపురం, పెద్దాపురం, అమలాపురం, రంపచోడవరం, చింతూరు సబ్‌ డివిజ¯ŒS పరిధిలో ఎటువంటి సమావేశాలు నిర్వహించరాదని, ఈ ఉత్తర్వులను ప్రతి ఒక్కరూ పాటించాలని, ఉల్లంఘనకు పాల్పడేవారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
 
మరిన్ని వార్తలు