సీలేరు: సీలేరు జల విద్యుత్కేంద్రంలోని రెండో నంబర్ యూనిట్ మరమ్మతులకు గురైంది. విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. యూనిట్ అప్పర్ గ్రైడింగ్ బేరింగ్లో ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గులను గమనించారు. దీనిని ఇంజినీరింగ్ బందం జెన్కో ఉన్నతాధికారులకు తెలిపింది. ఎకాయెకిన ఎల్టీకీ అనుమతులు జారీ చేశారు. దీంతో స్థానిక గుత్తేదారులతో బుధవారం నుంచి యూనిట్ పనులు చేపడుతున్నారు. యూనిట్ను బాగు చేస్తున్నట్టు జెన్కో డివిజనల్ ఇంజినీర్ సుధాకర్ తెలిపారు. ఈ పనులు పది రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు.