చికిత్స పొందుతూ తిరుమలరావు మృతి

3 Oct, 2015 18:38 IST|Sakshi

ఒంగోలు : గత ఐదు రోజుల నుంచి ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తిరుమలరావు శనివారం నాడు మృతిచెందాడు. ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలం పోకూరులో ఐదురోజుల కిందట మనుసాగర్ అనే బాలుడిని క్షుద్రపూజల కోసం తిరుమలరావు బలిచ్చాడు. విషయం తెలుసుకున్న స్థానికులు తిరుమలరావుపై ఆగ్రహంచి, కిరోసిన్ పోసి నిప్పుపెట్టగా తీవ్ర గాయాలపాలైన విషయం విదితమే. అప్పటినుంచి ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తిరుమలరావు శనివారం సాయంత్రం మృతిచెందాడు.

మరిన్ని వార్తలు