కోహిర్ మండలం మద్రి గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సతీష్(18), శ్రీనివాస్(19) అనే ఇద్దరు యువకులు నారింజవాగులో ఈతకెళ్లి ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.