ఎచ్చెర్ల: బీ పార్మశీ రెండో విడత కౌన్సెలింగ్ బైపీసీ స్ట్రీం విద్యార్థులకు ప్రారంభమైంది. శ్రీకాకుళం పురుషుల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమాయ కేంద్రంలో బుధవారం ధృవీకరణ పత్రాలు పరిశీలించగా, 26 మంది హాజరయ్యారు. వీరిలో 12 మంది ఓసీ, బీజీ విద్యార్థులు ఉండగా, 14 మంది ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు. గురువారంతో ధృవీకరణ పత్రాల పరిశీలన, ఆప్షన్ల ఎంట్రీ ముగియనుంది. క్యాంప్ ఆఫీసర్ ఆర్.త్రినాథరావు, అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్ టీవీ రాజశేఖర్ కౌన్సెలింగ్ ప్రక్రియ పర్యవేక్షించారు.