విజయవాడ: రౌడీల ఆగడాలపై బెజవాడ పోలీసులు కొరడా ఝుళిపించారు. మొగల్రాజపురం కొండ ప్రాంతంలో మంగళవారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
ముగ్గురు ఏసీపీలు, నలుగురు సీఐలు, 10 మంది ఎస్ఐలతో ఇంటింటీని జల్లెడ పట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. రౌడీల ఆగడాలను సాక్షి వెలుగులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.