కరీంనగర్ స్పోర్ట్స్ : ముంబైలో ఈ నెల 22 నుంచి 25 వరకు జరిగిన 18వ ఎఫ్ఎస్కేఏ ప్రపంచకప్ కరాటే పోటీల్లో స్థానిక షోటోకాన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరచి పతకాలు సాధించారు. 12 దేశాల నుంచి సుమారు 1200 మంది క్రీడాకారులు హాజరైన ఈ పోటీల్లో జిల్లా నుంచి పాల్గొన్న జి.దీప్తి, ఎం.భవాని, టి.శివతేజ, జి.రాకేశ్ కటా, స్పారింగ్లలో పోరాట పటిమ కనబరిచి మూడు స్వర్ణ పతకాలు, రెండు రజత పతకాలు, ఒక కాంస్య పతకాన్ని సాధించినట్లు కోచ్, చీఫ్ ఇన్స్ట్రక్టర్ గౌరు రాజిరెడ్డి తెలిపారు. పతకాలు సాధించి అంతర్జాతీయ స్థాయిలో జిల్లా కీర్తిని ఇనుమడింపజేసిన క్రీడాకారులను పలువురు అభినందించారు.