-
అనంతపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఉదయం అనంతపురానికి వస్తున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం. శంకరనారాయణ తెలిపారు. ఉదయం 10 గంటలకు అరవిందనగర్కు చేరుకుని మాజీ ఎమ్మెల్యే బి.నారాయణరెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని వెల్లడించారు.