ఆమె చరిత్రను తిరగరాస్తారు: అరుణ్ జైట్లీ

6 May, 2014 16:40 IST|Sakshi
ఆమె చరిత్రను తిరగరాస్తారు: అరుణ్ జైట్లీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న అమేధీ పార్లమెంట్ నియోజకవర్గంలో తమ పార్టీ నాయకురాలు స్మృతి ఇరానీ విజయం సాధిస్తారని బీజేపీ సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీ అన్నారు. భారీ మెజారిటీతో విజయం సాధించి చరిత్రను ఆమె తిరగరాస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

వారణాసి ప్రజలు మోడీని కోరుకుంటున్నారని చెప్పారు. క్రిమినల్స్ మద్దతుతో పోటీలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థిని కాశీ ప్రజలు ఆదరించరని అన్నారు. దేశ ప్రజలు రెండు ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయని అరుణ్ జైట్లీ అన్నారు. మోడీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారా లేక కేంద్రంలో అనిశ్చితికి కారణమవుతారా అంటూ ప్రశ్నించారు.

>
మరిన్ని వార్తలు