'ఉచిత హామీల వల్లే బాబు గెలిచాడు'

17 May, 2014 14:23 IST|Sakshi

అనంతపురం : ఎన్నికల్లో ప్రజలుకు ఇచ్చిన ఉచిత హామీల వల్లే చంద్రబాబు నాయుడు గెలిచారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పైలా నర్సింహయ్య అన్నారు. ఆయన శనివారం విలేకర్లతో మాట్లాడుతూ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజా ఉద్యమాలు చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చామనే ధీమాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేయటం తగదని పైలా నర్సింహయ్య అన్నారు.

 

మరిన్ని వార్తలు