నాయుడుపేట: ప్రవాస భారతీయుడు చిల్లకూరు గోపీరెడ్డి అమెరికాలోని డల్లాస్ నుంచి శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేటకు వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇక్కడకు చేరుకునేలా ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నారు.
బుధవారం తన తల్లి చిల్లకూరు నాగరాజమ్మతో కలసి పట్టణంలోని గురుకుల కళాశాల పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. ఓటుహక్కు వినియోగించుకుని ఆనందం వ్యక్తం చేశారు.