రారండోయ్‌

4 Nov, 2019 05:12 IST|Sakshi

నల్లూరి రుక్మిణి నవల ‘మేరువు’ ఆవిష్కరణ నవంబర్‌ 5న సాయంత్రం 5:30కు ద కల్చరల్‌ సెంటర్‌ ఆఫ్‌ విజయవాడ మరియు అమరావతి, మొగల్రాజపురం, విజయవాడలో జరగనుంది. ఆవిష్కర్త: అల్లం రాజయ్య. నిర్వహణ: విప్లవ రచయితల సంఘం.
యువకళావాహిని–గోపీచంద్‌ 2019 జాతీయ పురస్కారాన్ని ఓల్గాకు నవంబర్‌ 5న సాయంత్రం 6 గంటలకు సారథి స్టూడియోస్‌ ప్రీవ్యూ థియేటర్, అమీర్‌పేట, హైదరాబాద్‌లో ప్రదానం చేయనున్నారు. నందిని సిధారెడ్డి, సారిపల్లి కొండలరావు, ఆవుల మంజులత, కె.శివారెడ్డి, సి.మృణాళిని, త్రిపురనేని సాయిచంద్‌ పాల్గొంటారు.
మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి 27వ వర్ధంతి సభ నవంబర్‌ 7న ఉదయం 10 గంటలకు శ్రీగౌతమి ప్రాంతీయ పరిశోధన గ్రంథాలయం, రాజమహేంద్రవరంలో జరగనుంది. వక్త: కనకదండి సూర్యనారాయణమూర్తి. నిర్వహణ: మధునాపంతుల ట్రస్టు.
 ఆదికవి నన్నయ భట్టారక జయంతి మహాసభ నవంబర్‌ 7న ఉదయం 11 గంటలకు శ్రీగౌతమి ప్రాంతీయ పరిశోధన గ్రంథాలయం, రాజమహేంద్రవరంలో జరగనుంది. వక్త: గొట్టుముక్కల సత్య వెంకట నరసింహశాస్త్రి. నిర్వహణ: శరన్మండలి.
తెలంగాణ సాహిత్య అకాడమీ నెలనెలా నవలా స్రవంతిలో భాగంగా నవంబర్‌ 8న సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో బోయ జంగయ్య ‘జగడం’పై గోగు శ్యామల ప్రసంగిస్తారు.
 ‘2019–విమలాశాంతి సాహిత్య పురస్కారం’ను అద్దేపల్లి ప్రభు కథల సంపుటి ‘సీమేన్‌’కు ప్రకటించారు. డిసెంబరులో జరిపే సాహిత్య సభలో దీన్ని ప్రదానం చేస్తామని  ట్రస్టు ఛైర్మన్‌ శాంతి నారాయణ తెలియజేస్తున్నారు.
గతంలో సి.వి.కృష్ణారావు సమర్పణలో సాగిన నెలనెలా వెన్నెల కార్యక్రమాన్ని ఇకపై తెలంగాణ చైతన్య సాహితి కొనసాగించనుందని ఒద్దిరాజు ప్రవీణ్‌కుమార్‌ తెలియజేస్తున్నారు. మొదటి కార్యక్రమం నవంబర్‌ 9న (రెండో శనివారం) సాయంత్రం 5 గంటలకు ఎన్బీటీ హాల్, ఆంధ్ర మహిళా సభ, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాదులో జరగనుంది.
వెన్నెల సత్యం కవితా సంపుటి ‘బతుకుచెట్టు’ ఆవిష్కరణ నవంబర్‌ 10న ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్‌ హైస్కూల్, షాద్‌ నగర్, రంగారెడ్డి జిల్లాలో జరగనుంది. ఆవిష్కర్త: ఎన్‌.గోపి. నిర్వహణ: తెలంగాణ సాహితి, తెలుగు పూలతోట. 

మరిన్ని వార్తలు