రేవంత్ రెడ్డిని అనుమతించొద్దంటూ పిటిషన్

1 Jun, 2016 18:38 IST|Sakshi

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో గురువారం జరగనున్న జనజాతర సభకు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని రాకుండా చూడాలని విద్యార్థి జేఏసీ చైర్మన్ బాలరాజ్ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించాడు. రేవంత్ రెడ్డి వస్తే శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నందున.. ఆయన్ను అడ్డుకునేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని హెచ్ఆర్సీకి బాలరాజ్ పిటిషన్ సమర్పించాడు. సభకు రేవంత్ను అనుమతించొద్దని బాలరాజ్ కోరాడు.

మరిన్ని వార్తలు