మింట్ కాంపౌండ్‌లో ఉద్యోగుల ఆందోళన

14 Jun, 2016 18:30 IST|Sakshi

హైదరాబాద్: మింట్ కాంపౌండ్‌లో కరెంట్ షాక్‌తో ఒక ఉద్యోగి మృతి చెందటంతో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. మహ్మద్ సిద్దిఖీ అనే కాంట్రాక్టు ఉద్యోగి మంగళవారం సాయంత్రం విధి నిర్వహణలో ఉండగానే ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై చనిపోయాడు. దీంతో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఉద్యోగులు సూపరింటెండెంట్ ఇంజినీర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అధికారులు ఉద్యోగ సంఘాల నేతలతో ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు