ఈసెట్ సహా సెట్ల అడ్మిషన్ల షెడ్యూల్ ఖరారు

26 Jun, 2015 01:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశ ప్రక్రియ ముగింపు దశకు చేరుకోవడంతో ఇతర కోర్సుల ప్రవేశాల షెడ్యూల్‌ను ప్రభుత్వం ఖరారు చేసింది. గురువారం ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి అధ్యక్షతన ఏపీ సెట్-2015 అడ్మిషన్ల కమిటీ సమావేశం జరిగింది.ఈసెట్‌ను జూలై 2న నిర్వహించాలని నిర్ణయించారు. నోటిఫికేషన్ శుక్రవారం వెలువరించనున్నారు.కాగా ఎంసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా ధ్రువపత్రాల పరిశీలన, వెబ్‌ఆప్షన్ల నమోదు, మార్పుల ప్రక్రియ ముగియడంతో  శుక్రవారం సీట్ల కేటాయింపు జరపనున్నారు.

మరిన్ని వార్తలు