'గణేష్ విగ్రహాల ఎత్తు 15 అడుగులే ఉండాలి'

29 Jun, 2016 17:23 IST|Sakshi

హైదరాబాద్: నగరంలో మెట్రో నిర్మాణం కారణంగా వినాయకుని విగ్రహలు ఈసారి 15 అడుగుల ఎత్తు మాత్రమే ఉండేలా చూడాలని తెలంగాణ  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సూచించారు. బుధవారం భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితో ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీలో వినాయక చవితి, నిమజ్జనం ఏర్పాట్లపై చర్చించారు.

అదేవిధంగా హైకోర్టు ఆదేశాలను గణేశ్ ఉత్సవ సమితికి ఈ సందర్భంగా వివరించారు. విగ్రహాల తయారీలో మట్టి, సాధారణ రంగులు వాడాలని వారికి రాజీవ్ శర్మ విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు