‘హైకోర్టు అంశం గవర్నర్ చూసుకుంటారు’

17 Jul, 2016 18:29 IST|Sakshi

ఉమ్మడి హైకోర్టుకు సంబంధించి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని సమస్యలను పరిష్కరించుకోవాలని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. బీజేపీ శాసనసభపక్ష నేత జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర న్యాయవిభాగం కన్వీనర్ రవీందర్ విశ్వనాథ్ నేతృత్వంలోని ఆదివారమిక్కడ కేంద్ర మంత్రి దత్తాత్రేయకు వినతి పత్రం అందజేశారు. హైకోర్టు విభజన, న్యాయమూర్తుల ఆప్షన్ తదితర అంశాలపై 12 పేజీల నివేదికను అందజేశారు. అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ గవర్నర్ ఈ విషయంలో చొరవ తీసుకొని న్యాయస్థానం తీర్పును ఆధారంగా చేసుకొని విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. కేంద్రహోంమంత్రి చొరవతో గవర్నర్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు జరుపుతున్నారన్నారు.

 

>
మరిన్ని వార్తలు