-

భార్యను చంపేసిన భర్త

12 Nov, 2015 16:15 IST|Sakshi

క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కోపంలో విచక్షణ కోల్పోయిన ఓ భర్త.. కట్టుకున్న భార్యనే చంపేశాడు. వివరాలు.. సికింద్రాబాద్ అడ్డగుట్ట ప్రాంతంలోని తుకారాంగేట్ వద్ద ఉండే శ్రీనివాస్, సాంబ దంపతులు గురువారం సాయంత్రం గొడవపడ్డారు. తీవ్ర కోపోద్రిక్తుడైన శ్రీనివాస్ భార్యను కత్తితో నరికి చంపాడు. అనంతరం ఘటనస్థలం నుంచి పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా.. భార్యా, భర్తల మధ్య గొడవకు కారణాలు తెలియ రాలేదు.


 

మరిన్ని వార్తలు