కాచిగూడలో కార్డెన్ సెర్చ్

26 Mar, 2016 22:13 IST|Sakshi

హైదరాబాద్: నగరంలోని కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ ఆధ్వర్యంలో 200 మంది పోలీసులతో సుందర్ నగర్లో కార్డెన్ సెర్చ్ చేపట్టారు. ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాలనీలో ప్రతి ఇంటినీ పోలీసులు జల్లెడ పడుతున్నారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల కార్డెన్ సెర్చ్ కొనసాగుతుంది.

>
మరిన్ని వార్తలు