టీఆర్‌ఎస్‌లోనే తెలంగాణ ద్రోహులు: రేవంత్‌

31 May, 2017 03:16 IST|Sakshi
సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి రాష్ట్రంలో కంటే తెలంగాణలో పరిస్థితులు దారుణంగా ఉన్నా యని టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ఈ పరిణామాలతో తాను మూడేళ్లలో నిద్రలేని రాత్రులెన్నో గడి పానన్నారు. మంగళవారం మీడియాతో మా ట్లాడుతూ.. తెలంగాణ ద్రోహులని సీఎం కేసీఆర్‌ ఎవరిని తిట్టారో ఇప్పుడు వారంతా ఆయన పక్కనే ఉన్నారని, తెలంగాణ ద్రోహులతోనే టీఆర్‌ఎస్‌ నిండిపోయిందని విమర్శించారు.

అక్కినేని అమల కుక్కలు పెంచడానికి కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని ఇచ్చిన కేసీఆర్, అమరుల కుటుం బాలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. యాదగిరిగుట్ట పేరును యాదాద్రిగా మార్చినా ఏమీ అనొద్దా అని అన్నారు. 

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega