ఆర్టీసీ నిధులు పక్కదారి పడుతున్నాయ్‌

10 Jul, 2017 01:41 IST|Sakshi

ప్రభుత్వంపై బీజేపీ ఆరోపణ
సాక్షి, హైదరాబాద్‌: కమీషన్ల కోసం కాంట్రాక్టర్లతో కుమ్ముౖక్కైన ప్రభు త్వం ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాల్సిన 60 కోట్లను సివిల్‌ పనులకు మళ్లించిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల చంద్రశేఖర్‌రావు ఆరోపించారు. బీజేపీ ఆర్‌టీఐ జిల్లా కన్వీనర్ల సమావేశం ఆదివారం రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. పేరాలతో పాటు బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు.

పేరాల మాట్లాడుతూ తెలంగాణ ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారి నుంచి అభివృద్ధి సెస్‌ పేరుతో రూపాయిని వసూలు చేస్తున్నారన్నారు. బస్‌స్టేషన్లలో కుర్చీలు, బెంచీలు, మరుగుదొడ్లు, సీలింగ్‌ ఫ్యాన్లు, పబ్లిక్‌ టెలిఫోన్‌ బూత్‌లు, రిజర్వేషన్‌ కౌంటర్లు, క్లోక్‌రూమ్‌ల వంటి సదుపాయాలను ఈ సెస్‌తో ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. కానీ ఈ నిధులను కమీషన్లు వచ్చే సివిల్‌ పనులకోసం ఖర్చుచేసిందన్నారు. ఆర్టీఐ చట్టం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చిందన్నారు.

మరిన్ని వార్తలు