ఏసీబీ ముందుకు శ్రీనివాస్ నాయుడు

18 Aug, 2015 12:00 IST|Sakshi

హైదరాబాద్: దివంగత మాజీ ఎంపీ డీకే ఆదికేశవుల నాయుడు కుమారుడు శ్రీనివాస్ నాయుడు మంగళవారం ఉదయం బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఓటుకు కోట్లు కేసులో 160సీఆర్సీసీ కింద సోమవారం శ్రీనివాస్ నాయుడుకు  తెలంగాణ ఏసీబీ నోటీసులు ఇచ్చింది.
శ్రీనివాస్ నాయుడు కార్యాలయ ఉద్యోగి విష్ణుచైతన్యను కూడా ఏసీబీ విచారిస్తోంది. ప్రస్తుతం శ్రీనివాస్ నాయుడు కర్ణాటకలోని ఓ బెవరేజస్ కంపెనీకి  ఎండీగా ఉన్నారు.
 
 

>
మరిన్ని వార్తలు