తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం

21 Oct, 2016 14:15 IST|Sakshi

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారమిక్కడ సమావేశమైంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. కొత్త సచివాలయం నిర్మాణం, కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై ఈ కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. నీటి పారుదల శాఖలో 63 ఇంజినీరింగ్ పోస్టులు, వైద్య ఆరోగ్య శాఖలో 13, అగ్నిమాపక శాఖలో 18 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది.అలాగే వ్యాట్ సవరణ, వినోద పన్ను అంశాలపై కేబినెట్ చర్చించనుంది.

 

మరిన్ని వార్తలు