ఎల్‌కేజీ చిన్నారి అదృశ్యం

27 Jun, 2016 16:41 IST|Sakshi

పాఠశాల సిబ్బంది గమనించకపోవటంతో ఓ చిన్నారి స్కూలు నుంచి ఎటో వెళ్లిపోయాడు. వనస్థలిపురంలోని గౌతం మోడల్ స్కూలులో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆడుకుంటూ బయటకు వెళ్లిన ఎల్‌కేజీ స్టూడెంట్ అయాన్ తిరిగి రాలేదు. స్కూలు సిబ్బంది ఈ విషయం గమనించలేదు. అన్నం పెట్టేందుకు వచ్చిన బాలుడి తల్లిదండ్రులు తమ కుమారుడు కనిపించకపోయేసరికి సిబ్బందిని నిలదీశారు. అప్పుడు తెలివి తెచ్చుకున్న సిబ్బంది తెల్లమొఖం వేశారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజి సాయంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

 

>
మరిన్ని వార్తలు