నలుగురు బాలికలు అదృశ్యం

31 May, 2016 10:11 IST|Sakshi

 రాజేంద్రనగర్ మండలం నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో నలుగురు బాలికలు కనిపించకుండాపోయారు. పుప్పాల్‌గూడ గ్రామం లంబాడిగడ్డకు చెందిన హసీనా(19), హుస్సేన్ బీ(16), సమీనా(13), షహీన్(10)సోమవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి రాత్రయినా తిరిగిరాలేదు. దీంతో వారి తల్లిదండ్రులు వెతుకులాడినా ప్రయోజనం కనిపించలేదు. ఈ మేరకు తల్లిదండ్రులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

 

మరిన్ని వార్తలు