ఎడ్యూ న్యూస్
నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను చేరువచేసే మొబైల్ ఆధారిత రిక్రూట్మెంట్ ప్రక్రియకు టీఎంఐ గ్రూపు సంస్థ శ్రీకారం చుట్టింది. అన్ని అర్హతలూ ఉండి కొలువు కోసం ఎదురుచూసే అభ్యర్థులకు జాబ్స్డైలాగ్ వెబ్పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిద్వారా సూక్ష్మ, చిన్నతరహా యూనిట్లకు అవసరమైన మానవ వనరులను అందించడమే ప్రధాన ఉద్దేశమని టీఎంఐ చైర్మన్ టి.మురళీధరన్ తెలిపారు.
టోల్ఫ్రీ నెంబర్ 1800-108-3344కు ఫోన్చేయడం, 040-71012014 నంబర్కు మిస్డ్కాల్ ఇవ్వడం ద్వారా ఉద్యోగార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చన్నారు. దీనిద్వారా అభ్యర్థుల అర్హతలకు తగిన కొలువుల వివరాలను అందజేస్తామని చెప్పారు. తర్వాత ఆ రెజ్యుమెలను సంబంధిత కంపెనీలకు పంపించి ఉద్యోగ సాధనలో సహకరిస్తామని తెలిపారు.