HYD: తమిళిసైను కలిసిన మాజీ గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు

22 Nov, 2023 19:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను మాజీ గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు కలిశారు. రాజ్‌భవన్‌లో వీరు కలుసుకోవడం విశేషం. 

వివరాల ప్రకారం.. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు బుధవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో కలిశారు. కాగా, మర్యాదపూర్వకంగానే తమిళిసైను కలిసి నరసింహన్‌ దంపతులు ముచ్చటించినట్టు సమాచారం. రాజకీయంగా వీరి మధ్య ఎలాంటి చర్చ జరగలేదని తెలుస్తోంది. 


 

మరిన్ని వార్తలు