టెన్త్ ఫలితాలు
నేడు తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు వెలువడనున్నాయి. సాయంత్రం 4 గంటలకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేయనున్నారు.
నేడు ఏపీ ఈసెట్
ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు పాలిటెక్నిక్ విద్యార్థుల కోసం నిర్వహించే ఏపీ ఈసెట్-2017 పరీక్ష నేడు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు జరిగే ఈ పరీక్షను తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు.
చంద్రబాబు ఢిల్లీ టూర్
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీతో ఆయన సమావేశం కానున్నారు.
మోదీ ఉత్తరాఖండ్ పర్యటన
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ఉత్తరాఖండ్లో పర్యటిస్తున్నారు. కేదార్నాథ్ ఆలయాన్ని ఆయన సదర్శించనున్నారు.
రోడ్డు ప్రమాదాలపై సమీక్ష
అమరావతి: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలపై నేడు డీజీపీ సమీక్ష. జిల్లాలవారిగా ప్రమాదాలకు గల కారణాలను విశ్లేషించనున్నారు.
కడయంతో ఘంటా చక్రపాణి భేటీ
నేడు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో భేటీ కానున్న టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి. గురుకుల పోస్టుల్లో అర్హతల విషయంలో వెసులుబాట్లపై చర్చించనున్నారు.
► ఢిల్లీ: కేంద్ర కేబినెట్ నేడు సమావేశం కానుంది.
► ఢిల్లీ: నేడు జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానం చేయనున్నారు.
ఐపీఎల్లో నేడు
కోల్కతా నైట్రైడర్స్ వర్సెస్ రైజింగ్ పూణే. కోల్కతా వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం.
అజ్లాన్ షా హాకీ
మలేసియా: అజ్లాన్ షా హాకీ టోర్నీలో నేడు జపాన్తో తలపడనున్న భారత్