జల్సాలకు అలవాటుపడి చోరీల బాట పట్టిన ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 9 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడిన ఇద్దరిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.