ఊరు.. ఊరేగింది

22 Aug, 2016 23:37 IST|Sakshi
హైదర్‌గూడ వద్ద సింధు విజయయాత్రపై పూల వర్షం

మన సింధు సిటీకి వచ్చింది...ఉత్సాహం ఉరకలేసింది..ఊరు ఊరంతా ఊరేగింది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి...ప్రశంసలందుకొన్న పీవీ సింధును భాగ్యనగరం ఘనంగా స్వాగతించింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు జనం  జేజేలు పలికారు. కాసేపు ఓపెన్‌ టాప్‌ వాహనంలో..మరికాసేపు గుర్రపు బగ్గీపై ఊరేగుతూ..పూలవర్షంలో తడుస్తూ..అభిమానుల అభినందనలు స్వీకరిస్తూ ఆమె గచ్చిబౌలి స్టేడియంకు  చేరుకుంది. 

మరిన్ని వార్తలు