హైదరాబాద్. కొత్తపేట చేపల మార్కెట్లో తూనికలు-కొలతలు, పౌరసరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. తూనికలు కొలతలు శాఖ అధికారి కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో దుకాణాలపై దాడులు చేసి ప్రభుత్వ ముద్రలు లేని తక్కెడలు, బాట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా షాపుల వారికి జరిమానాలు విధించారు. అయితే జరిమానా ఎంత అనేది అధికారులు ఇంకా వెల్లడించలేదు.