అమెరికాలో కారు ప్రమాదం : ఇద్దరు సిక్కుల మృతి

18 May, 2019 08:25 IST|Sakshi

వాషింగ్టన్‌: కారు ప్రమాదంలో ఇద్దరు సిక్కు యువకులు మృతిచెందారు. మృతులను ఇండియానా రాష్ట్రానికి చెందిన ధవ్‌నీత్‌ సింగ్‌ చల్లా, వరుణ్‌దీప్‌ సింగ్‌గా గుర్తించారు. ఈ ఘటన  బుధవారం రాత్రి 2.30 గంటలకు చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఒక వ్యక్తిని తప్పించబోయి పక్కనే ఉన్న చెట్టుకు కారును ఢీకొట్టారు. వెనక సీటులో  ఉన్న మరో వ్యక్తి గుర్జిత్‌ సింగ్‌ సంధూ (20)గా గుర్తించారు.
 

మరిన్ని వార్తలు