తల్లి ఎదుటే కోపంతో బ్రిడ్జ్‌పై నుంచి దూకి..

18 Apr, 2019 15:50 IST|Sakshi

షాంగై : కన్నతల్లి ముందే ఓ యువకుడు బ్రిడ్జ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చైనాలో బుధవారం చోటుచేసుకుంది. ఒక్కసారిగా జరిగిన ఈ హఠాత్పరిణామానికి షాకైన ఆ తల్లి బ్రిడ్జ్‌పైనే కుప్పకూలి ఏడుస్తున్న దృశ్యాలు అందరినీ కలచివేస్తున్నాయి. దీనికి సబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. 

వివరాలు.. కారులో షాంగై బ్రిడ్జ్‌ మీదుగు వెలుతున్నసమయంలో తల్లికి తన 17 ఏళ్ల కుమారిడికి మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన ఆ యువకుడు కారు లోంచి దిగి బ్రిడ్జ్‌పై నుంచి దూకేశాడు. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు.

మరిన్ని వార్తలు