కెన్యాలో 36మంది క్వారీ వర్కర్ల ఊచకోత

3 Dec, 2014 03:23 IST|Sakshi

నైరోబీ: కెన్యాలో సాయుధ దుండగులు తాజాగా జరిపిన కాల్పుల్లో 36మంది క్వారీ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఆచూకీ దొరకని మరి కొందరు అపహరణకు గురైనట్టుగా భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కెన్యా ఈశాన్యంలో సోమాలియా సరిహద్దు సమీపంలో మందేరా పట్టణంవద్ద గుడారాల్లో నిద్రిస్తున్న క్వారీ కార్మికులపై మంగళవారం తెల్లవారుజామున సాయుధులు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 36మంది కార్మికులు మరణించారని పోలీసులు, రెడ్‌క్రాస్ ప్రతినిధులు తెలిపారు.
 

మరిన్ని వార్తలు