ప్రజా ప్రభుత్వం కన్నా నియంతలే మేలు
ఆయుబ్ఖాన్కు బెస్ట్ రూలర్ అంటున్న పాకిస్తానీయులు
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ ప్రజలు ప్రజా పాలకులకన్నా.. మిలటరీ పాలకుల పరిపాలనే బాగుందని తాజా సర్వేలో స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులు, ప్రధానమంత్రులు, అధ్యక్షులు, మంత్రుల్లో 99 శాతం మంది అవినీతి పరులేనంట పాక్ ప్రజలు పేర్కొంటున్నారు. ప్రజా ప్రభుత్వాల కన్నా.. మిలటరీ పాలకుల ఏలుబడిలోనే దేశం అంతోఇంతో అభివృద్ధి సాంధించిందని ప్రజలు అభిప్రయాపడ్డారు. దేశం ఏర్పడ్డనాటినుంచి ఇప్పటి వరకూ అద్భుతంగా పాలించిన నేతలపై డాన్ పత్రిక సర్వే నిర్వహించింది.. ఇందులో పలు ఆసక్తిర విషయాలు వెలుగులోకి వచ్చాయి.