బెస్ట్‌ ఓపెనింగ్స్‌ వచ్చాయి...

19 May, 2019 05:51 IST|Sakshi
రాజా, అల్లు శిరీష్, మధుర శ్రీధర్, సంజీవ్‌ రెడ్డి, ధీరజ్‌

– అల్లు శిరీష్‌

అల్లు శిరీష్‌ హీరోగా డి.సురేష్‌ బాబు సమర్పణలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్, బిగ్‌ బెన్‌  సినిమాస్‌ పతాకాలపై రూపొందిన చిత్రం ‘ఏబీసీడీ’. ‘అమెరిక్‌ బోర్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశి’ ట్యాగ్‌లైన్‌. సంజీవ్‌ రెడ్డి దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమాను ‘మధుర’ శ్రీధర్, యష్‌ రంగినేని నిర్మించారు. మే 17న చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. శుక్రవారం జరిగిన ఈ చిత్రం సక్సెస్‌మీట్‌లో ‘మధుర’ శ్రీధర్‌ మాట్లాడుతూ– ‘‘తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్‌ ని కరెక్ట్‌గా చేయాలి. ప్రేక్షకులందరికీ నచ్చేలా తీయాలని మేం సినిమా ఆరంభించే ముందు అనుకున్నాం. అది నెరవేరింది. శిరీష్‌ ఫెంటాస్టిక్‌గా నటించాడు. శిరీష్‌లో హ్యాపీనెస్‌ చూడాలనుకున్నాను. అది కూడా ఈ రోజు నెరవేరింది. హీరో, హీరోయిన్‌ మధ్య లవ్‌ స్టోరీ, భరత్, వెన్నెల కిశోర్‌ల కామెడీ హైలైట్‌ అయ్యాయని అంటున్నారు.

శిరీష్‌ నటించిన బెస్ట్‌ మూవీ ‘శ్రీరస్తు– శుభమస్తు’ని మించి మా సినిమా వసూళ్లు ఉండాలన్నది మా ఆశ. వీకెండ్‌కే ఆ ఫీట్‌ని సాధిస్తాం’’ అన్నారు. సంజీవ్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘మేమందరం సినిమాలో ఎక్కడెక్కడ మంచి స్పందన వస్తుందని అనుకున్నామో, అక్కడే ప్రేక్షకుల నుండి సూపర్బ్‌ రెస్పా¯Œ ్స రావటం ఆనందంగా ఉంది. శిరీష్‌గారి యాక్టింగ్‌కి మంచి పేరు వచ్చింది’’ అన్నారు. అల్లు శిరీష్‌ మాట్లాడుతూ– ‘‘నా కెరీర్‌ బెస్ట్‌ ఓపెనింగ్స్‌ వచ్చాయి. ఈ రోల్‌ చేస్తున్నప్పుడు పర్సనల్‌గా బాగా కనెక్ట్‌ అయ్యాను. ఆర్టిస్ట్‌గా ఎదిగిన ఫీలింగ్‌ ఉంది. ఈ సినిమాకు వచ్చినంత రెస్పాన్స్‌ గతంలో నేను చేసిన ఏ సినిమాకూ రాలేదు. నాకు ఇంత పేరు వచ్చిందంటే ఆ క్రెడిట్‌ అంతా డైరెక్టర్‌ సంజీవ్‌దే’’ అన్నారు. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ ధీరజ్‌ పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు