రాజస్థాన్‌ ఫిలిం ఫెస్టివల్‌కి మధురపూడి..

19 Dec, 2023 00:50 IST|Sakshi

‘మధురపూడి గ్రామం అనే నేను’ సినిమా ‘రాజస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌’ 2023కి ఎంపిక అయింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్‌ వెల్లడించింది. శివ కంఠమనేని, క్యాథలిన్‌ గౌడ జంటగా మల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మధురపూడి గ్రామం అనే నేను’. జి.రాంబాబు యాదవ్‌ సమర్పణలో లైట్‌ హౌస్‌ సినీ మ్యాజిక్‌పై కేఎస్‌ శంకర్‌ రావు, ఆర్‌.వెంకటేశ్వర రావు నిర్మించిన ఈ సినిమా అక్టోబర్‌ 13న విడుదలైంది.

ఈ మూవీ 10వ ‘రాజస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌’కి ఎంపిక అయింది. 2024 జనవరిలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ‘‘మా మూవీ భవిష్యత్‌లో మరిన్ని అవార్డులు సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు శివ కంఠమనేని. ‘‘ఈ సినిమాపై మొదటి నుండి మా టీమ్‌ చాలా నమ్మకంగా ఉన్నాం. ఈ రోజు మా నమ్మకం నిజమైంది’’ అన్నారు మల్లి.

>
మరిన్ని వార్తలు