బ్లూవేల్‌ చాలెంజ్‌

9 Nov, 2018 02:55 IST|Sakshi
పూర్ణ

బ్లూ వేల్‌ చాలెంజ్‌ .. సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉండుంటే ఈ ఆట గురించి వినుంటారు. సీరియస్‌ రిస్కులతో కూడుకున్న ఈ గేమ్‌లో చాలామంది హానికి గురయ్యారు. 50 రోజుల పాటు సాగే ఈ చాలెంజ్‌లో చివరి వరకూ వెళ్లే ఆటగాళ్లను సూసైడ్‌ చేసుకొమ్మని ప్రేరేపించే భయంకరమైన గేమ్‌ అది. ఇప్పుడు ఆ ఆట ఆధారంగా తమిళంలో ఓ చిత్రం తెరకెక్కనుంది.

‘అవును’ ఫేమ్‌ పూర్ణ ముఖ్య పాత్రలో నూతన దర్శకుడు రంగనాథన్‌ తెరకెక్కించనున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు రంగనాథన్‌ మాట్లాడుతూ – ‘‘ఇప్పటి జనరేషన్‌ పిల్లలందరి వద్ద స్మార్ట్‌ ఫోన్స్‌ ఉన్నాయి. దీని వల్లే ఇలాంటి భయంకరమైన గేమ్స్‌ కూడా ఎక్కువవుతున్నాయి. రీసెంట్‌గా పాపులర్‌ అయిన గేమ్‌ ‘బ్లూవేల్‌ చాలెంజ్‌’. ఈ గేమ్‌ ఆధారంగా చిత్రం తెరకెక్కిస్తున్నాం. క్రిమినల్స్‌ ఎవరో చూపించలేం కానీ తల్లిదండ్రులు ఎలా జాగ్రత్తగా ఉండాలో మా చిత్రం ద్వారా చూపించదలిచాం’’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు