ఎనిమిదేళ్ల తర్వాత రజనీకాంత్‌..

10 May, 2017 20:45 IST|Sakshi
ఎనిమిదేళ్ల తర్వాత రజనీకాంత్‌..

చెన్నై: ఎనిమిదేళ్ల తర్వాత సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఫ్యాన్స్‌ను కలవనున్నారు. ఇందుకు చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణమండపం వేదిక కానుంది. ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకూ నాలుగు రోజుల పాటు రజనీకాంత్‌ ఫ్యాన్స్‌ను కలుస్తారు.

చివరగా 2007లో శివాజీ సినిమా విడుదల తర్వాత రజనీ అభిమానులను కలుసుకున్నారు. ఈ మీట్‌లో విడిగా ఒక్కొక్కరితో రజనీ సెల్ఫీ దిగుతారు. అయితే, రజనీతో విడిగా మాట్లాడే అవకాశం మాత్రం లేదు. వాస్తవంగా ఏప్రిల్‌లోనే ఫ్యాన్స్‌ మీట్‌ జరగాల్సివుంది. కొన్ని అనివార్య కారణాలతో అది వాయిదా పడింది.