ఆహుతి ప్రసాద్ అంత్యక్రియలు పూర్తి

5 Jan, 2015 14:13 IST|Sakshi
ఆహుతి ప్రసాద్ అంత్యక్రియలు పూర్తి

హైదరాబాద్: ప్రముఖ నటుడు ఆహుతి ప్రసాద్ అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్ ఎర్రగడ్డ శ్మశానవాటికలో సోమవారం మధ్యాహ్నం ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. సినీ రంగ ప్రముఖులు, అభిమానులు తరలివచ్చి ఆహుతి ప్రసాద్కు కడపడి వీడ్కోలు పలికారు. అంతకుముందు చిరంజీవి తదితరులు ఆహుతి ప్రసాద్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఆహుతి ప్రసాద్ కేన్సర్ వ్యాధితో ఆదివారం మరణించిన సంగతి తెలిసిందే.