ఐశ్యర్య వద్దకు తరలిన బాలీవుడ్‌

19 Mar, 2017 16:27 IST|Sakshi
ఐశ్యర్య వద్దకు తరలిన బాలీవుడ్‌

ముంబయి: ప్రముఖ నటి, నటుడు ఐశ్వర్యరాయ్, అభిషేక్‌ బచ్చన్‌ను పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు పరామర్శించారు. గత కొన్ని రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఐశ్వర్య తండ్రి క్రిష్ణరాజ్ రాయ్ శనివారం ముంబైలోని ఓ ఆస్పత్రిలో కన్నుమూయడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయిన వారిని పలువురు కలిసి ధైర్యం చెప్పారు. సూపర్‌స్టార్‌ షారుక్‌ఖాన్‌, దర్శకుడు సంజయ్‌ లీలా బన్సాలీ, అశుతోష్‌ గౌరీకర్‌, సోనాలీ బింద్రే తదితరులు ఐశ్వర్య తండ్రి క్రిష్ణరాజ్‌కు పూలతో శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ ఏడాది జనవరి నుంచి క్రిష్ణరాజ్ రాయ్ కేన్సర్ సమస్యలతో సతమతమయ్యారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు లోను కావడంతో ఆయనను ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ఆయన శరీరం సహకరించక చనిపోయారు. శనివారం రాత్రి 8.30గంటల ప్రాంతంలో ముంబయిలోని విలే పర్లే సేవా సంస్థాన్‌ స్మశాన్‌ భూమిలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఈ అంత్యక్రియలకు దాదాపు సగానికి పైగా బాలీవుడ్‌ తరలి వచ్చింది.
(నటి ఐశ్వర్యరాయ్ తండ్రి మృతి)