‘ఆర్య’ సినిమాతో సెన్సేషన్ సృష్టించిన సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఓ అంచనా ఉంటుంది. ఆర్య సినిమాకు సీక్వెల్గా ‘ఆర్య2’ తీసిన ఈ కాంబో.. అంతగా మెప్పించలేకపోయింది. అయితే మళ్లీ ఇన్నేళ్ల తరువాత వీరిద్దరి కాంబినేషన్లో ఓ చిత్రం రాబోతోందని అధికారికంగా ప్రకటించేశారు.
రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్తో మంచి ఊపు మీదున్న సుకుమార్.. ప్రస్తుతం మహేష్ బాబుకు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉండగా.. అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాతో బిజీ కానున్నాడు. ఇక ఈ చిత్రాల తరువాత సుక్కు, బన్నీలు కలిసి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో క్రేజీ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించనున్నారు. ఈ మూవీకి సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.