పల్లెటూరి నేపథ్యంలో...

1 Jun, 2018 00:18 IST|Sakshi

హాస్యనటుడు పృథ్వీరాజ్‌ ప్రధాన పాత్రలో రామకృష్ణ, అవంతికా జంటగా నటించిన చిత్రం ‘ఆనందం అంబరమైతే’. ఈరంకి సుబ్బుని దర్శకునిగా పరిచయం చేస్తూ బుద్దాల సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈరంకి సుబ్బు మాట్లాడుతూ– ‘‘మనిషి జీవితంలో మంచి, చెడు రెండూ ఉంటాయి.

అనుకున్నది సాధించినప్పుడు ఆనందం అంబరాన్ని తాకడం సహజం. ఈ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమిది. పూర్తి పల్లెటూరి నేపథ్యంలో  ఉంటుంది. గోదావరి తీరంలో ఎప్పుడూ చూడని లొకేషన్స్‌లో చిత్రీకరించాం. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వచ్చింది’’ అన్నారు. ‘‘మా సినిమా ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. శ్రీకృష్ణ సంగీతం సినిమాకు హైలెట్‌’’ అన్నారు బుద్దాల సత్యనారాయణ. ఈ చిత్రానికి కెమెరా: చైతన్య వనపల్లె, సహనిర్మాత: బుద్దాల హైమావతి.

మరిన్ని వార్తలు