ఫైనల్గా అనుష్క చేతికే వెళ్లిందా..?

5 Jun, 2017 10:29 IST|Sakshi

బాహుబలి తరువాత అదే స్థాయిలో సౌత్లో తెరకెక్కుతున్న సినిమా సంఘమిత్ర. తమిళ దర్శకుడు సుందర్.సి దాదాపు 250 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తొలుత మహేష్ బాబు, విజయ్ లాంటి స్టార్ హీరోలతో ఈ సినిమా చేయాలని భావించినా.. వారు బల్క్ డేట్స్ ఇచ్చేందుకు అంగీకరించకపోవటంతో జయం రవి, ఆర్యలు హీరోలుగా సినిమా ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటించారు. ఇక కీలకమైన సంఘమిత్ర పాత్రకు శృతిహాసన్ను ఫైనల్ చేశారు. కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఘనంగా సినిమాను లాంచ్ చేశారు.

అయితే లాంచింగ్ తరువాత శృతి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. తనకు డేట్స్ విషయంలో క్లారిటీ ఇవ్వటం లేదన్న కారణంతో సంఘమిత్ర నుంచి తప్పుకుంటున్నట్టుగా తెలిపింది శృతిహాసన్. దీంతో టైటిల్ రోల్ కోసం మరో స్టార్ హీరోయిన్ కోసం ప్రయత్నాలు ప్రారంభించిన చిత్రయూనిట్... సౌత్ ఇండస్ట్రీలో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన అనుష్కనే సంప్రదిస్తున్నారట. ముందుగా తమన్నా, కాజల్తో పాటు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే పేర్లు కూడా వినిపించినా.. ఫైనల్గా అనుష్క కే ఫిక్స్ అయ్యారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం భాగమతి సినిమాలో నటిస్తున్న అనుష్క సంఘమిత్రకు అంగీకరిస్తుందో.. లేదో.. చూడాలి.